ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 12 September 2026, 7:46 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

దశదినకర్మలో పాల్గొన్న తొట్ల తిరుపతి యాదవ్ మృతుడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి

దశదినకర్మలో పాల్గొన్న తొట్ల తిరుపతి యాదవ్ మృతుడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి

అర్జున్ సమాచారం సెప్టెంబర్ 12 | రామగిరి, డెస్క్.

రామగిరి మండలం ఆదివారంపేట గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ యూత్ నాయకుడు కుర్రె రాజ్‌కుమార్ తండ్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ వార్డు సభ్యుడు కీ.శే. కుర్రె చిన్న కొమురయ్య దశదినకర్మ కార్యక్రమంలో మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తొట్ల తిరుపతి యాదవ్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా చిన్న కొమురయ్య చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతిని తెలిపారు. మృతుడి కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ తరఫున అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ కమిటీ కార్యదర్శి రోడ్డ బాపన్న పటేల్, మాజీ జడ్పీటీసీ మైదం భారతి–వరప్రసాద్, గ్రామ శాఖ అధ్యక్షుడు మైదం బుచ్చయ్య, మాజీ సర్పంచ్ వేపచెట్టు రాజేశం, మాజీ ఉపసర్పంచ్ అట్టే తిరుపతిరెడ్డి, మడిపెల్లి సదానందం, మేడగాని మల్లేష్, మెండే ఓదెలు, గణేష్, డి. రాజిరెడ్డి, సిహెచ్. శ్రీనివాస్ రెడ్డి, రాజా కొమురయ్య, మల్లయ్య, బుచ్చయ్య, రామిరెడ్డి, ఏలువాక వెంకటేష్, జక్కుల బ్రదర్స్, మైదం వెంకటేష్, జె. రాజు, జక్కుల సతీష్, మైదం ఓదెలు, కుటుంబ సభ్యులు కుర్రె పెద్ద కొమురయ్య తదితరులు పాల్గొన్నారు.